నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా వైరస్ బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ అని రిజల్ట్ రాగానే బండ్ల గణేష్ కి చాలా భయమేసిందట. తర్వాత మెల్లిగా ఆ భయం నుంచి బయటపడి ట్రీట్ మెంట్ తీసుకుని బయటపడ్డాడు బండ్ల గణేష్. తాజాగా తను ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు విషయాలను తెలియజేసాడు గణేష్.
భవిష్యత్తులో నారా లోకేష్ సి.యం అవుతాడా అని యాంకర్ అడిగితే... ''వాళ్ల గురించి, వీళ్ల గురించి నాకేం తెలుస్తుందమ్మ. ఎవరో సి.యం అవ్వాలని ఎందుకు కోరుకుంటాను. నేనే సి.యం అవ్వాలనుకుంటాను'' అని చెప్పాడు. ఫన్నీగా ఈ విషయాన్ని చెప్పిన బండ్ల గణేష్ కరోనా తర్వాత తన మైండ్ సెట్ మారిందని, అందరితో చక్కగా మాట్లాడుతూ హ్యాపీగా లైఫ్ గడిపేయాలని ఉందని తెలిపాడు బండ్ల.