మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'అలివేలుమంగ వెంకటరమణ' టైటిల్ ని అనుకుంటున్నారు. కాగా ఈ సినిమాకి ఫస్ట్ హీరోయిన్ గా కీర్తిసురేష్ ని తీసుకున్నారనే వార్తలు ఉన్నాయి.
తాజా వార్తల ప్రకారం సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ని తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అఖిల్ 'హలో' చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన కళ్యాణిప్రియదర్శన్ ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి', శర్వానంద్ 'పడిపడి లేచె మనసు' సినిమాల్లో నటించింది. ఇప్పుడు గోపీచంద్, తేజ కాంబినేషన్ సినిమాకి కళ్యాణిప్రియదర్శన్ కమిట్ అయితే, తెలుగులో వరుసగా సినిమాలు కమిట్ అవుతోందని చెప్పొచ్చు.