స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'అలా వైకుంఠపురంలో' సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వార్డె ఫ్యాన్సీ రేట్ ఇచ్చి దక్కించుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ హిందీ రీమేక్ తెరకెక్కనుందట. ప్రస్తుతం స్ర్కిఫ్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. కాగా ఈ రీమేక్ కి సంబంధించి ఓ అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
తెలుగు వెర్షన్ లో పూజా హెగ్డె కథానాయికగా నటించింది. తాజా వార్తల ప్రకారం హిందీ వెర్షన్ కోసం జాన్వి కపూర్ ని కథానాయికగా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. 'అలా వైకుంఠపురంలో' లాంటి హిట్ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం అంటే అమ్మడికి బంపర్ ఆఫర్ దక్కినట్టేనని చెప్పొచ్చు. తెలుగులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో జాన్విని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారమ్. మొత్తం మీద అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. మరి వాటిని సద్వినియోగం చేసుకుని తన కో- స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందేమో వేచిచూద్దాం.