టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. కుటుంబసభ్యులకు లైట్ గా ఫీవర్ వచ్చింది. టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. మేమందరం హోం క్వారంటైన్ కి వెళ్లిపోతున్నాం అని ట్వీట్ చేసారు రాజమౌళి. ఈ వార్త అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎందుకంటే రాజమౌళి కుటుంబం ఖచ్చితంగా కరోనా పైన పూర్తి అవగాహనతో ఉంటుంది కాబట్టి, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే రాజమౌళి కరోనా బారిన పడ్డారనే వార్త షాక్ కి గురి చేస్తోంది. ఎవరి ద్వారా రాజమౌళికి కరోనా సోకిందో తెలియాల్సి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో కరోనా కలకలం మామూలుగా లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందనే వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఐశ్వర్య, ఆరాధ్య హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బిగ్ బి అమితాబ్ మాత్రం ఇంకా హాస్పటల్లోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా చాలామంది సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. ఎన్నో సౌకర్యాలతో, కాస్ట్ లీ లైఫ్ ని ఎంజాయ్ చేసే సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారంటే ఈ మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో ఊహించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన టైమ్ ఇది.