'అఆ', 'శతమానంభవతి', 'ఉన్నది ఒక్కటే జిందగీ', 'రాక్షసుడు' చిత్రాల్లో అద్భుతంగా నటించి తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది అనుపమాపరమేశ్వరన్. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ, హీరోయిన్ గా తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజా వార్తల ప్రకారం ఓ కుర్ర హీరో చేస్తున్న రెండు సినిమాలకు హీరోయిన్ గా అనుపమాపరమేశ్వరన్ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
కుర్ర హీరో నిఖిల్ రెండు సినిమాలు చేయబోతున్నాడు. ఒకటి 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ 'కార్తికేయ 2'. రెండోది మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్న '18 పేజెస్'. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా ఈ సినిమాకి కూడా అనుపమాపరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇదే కనుక జరిగితే నిఖిల్ నటించబోతున్న రెండు సినిమాల్లో అనుపమాపరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. రెండూ క్రేజీ ప్రాజెక్ట్. అమ్మడికి బంపర్ ఆఫర్లు తగిలినట్టే. మరి ఈ రెండు అవకాశాలను ఉపయోగించుకుని అనుపమా టాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కుతుందేమో వేచిచూద్దాం.