కరోనా వైరస్ విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరినీ భయపెడుతోంది ఈ వైరస్. సెలబ్రెటీలు సైతం కరోనా బారినపడి విలవిలలాడిపోతున్నారు. ఇటీవలే స్టార్ డైరెక్టర్ రాజమౌళి కరోనా బారిన పడ్డారు. హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.
తాజాగా డైరెక్టర్ తేజ కరోనా బారిన పడ్డారు. ఆయన ఇటీవల ముంబయ్ వెళ్లి వచ్చారట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కరోనా టెస్ట్ చేయించుకున్నారట తేజ. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే తెలియజేసారు. తేజ ఆరోగ్యం నిలకడగానే ఉంది. హోం క్వారంటైన్ లో ఉన్నారు.
కరోనా గురించి ఎంతో అవగాహనతో ఉండే సెలబ్రెటీలు ఈ వైరస్ బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది.