సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో కీర్తిసురేష్ మెయిన్ లీడ్ చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుందనే వార్త బయటికి వచ్చింది. ఆ సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండేని అప్రోచ్ అయ్యారని సమాచారమ్.
బాలీవుడ్ హీరో చంకీపాండే తనయ అనన్య పాండే 'ఫైటర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి రంగప్రవేశం చేస్తోంది. పూరిజగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ఫైటర్' సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పుడు రెండో సినిమాగా 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుందంటే అమ్మడు టాలీవుడ్ లో జెండా పాతేయడానికి పునాదులు పడినట్టేనని చెప్పొచ్చు. మరి 'సర్కారు వారి పాట' కు సెకండ్ హీరోయిన్ గా అనన్యపాండే కన్ ఫార్మ్ అవుతుందా వేచిచూద్దాం.