స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ లైన్, అతని క్రియేటివిటీ మీద నమ్మకమున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా చేయడానికి గానూ 45కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఇందుకు నిర్మాత అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ పారితోషికం 45కోట్లు అంటే, ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో... అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోందని చెప్పొచ్చు.