పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. స్ర్కిఫ్ట్ కి సంబంధించి త్రివిక్రమ్ కేర్ తీసుకుంటానని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించాడట.
అయితే తాజా వార్తల ప్రకారం ఈ స్ర్కిఫ్ట్ పైన టైమ్ స్పెండ్ చేయడానికి త్రివిక్రమ్ కి టైమ్ సరిపోవడంలేదట. ప్రస్తుతం 'అలా వైకుంఠపురం లో' సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం స్ర్కిఫ్ట్ రెడీ చేయాల్సి ఉంది. దాంతో 'పింక్' రీమేక్ స్ర్కిఫ్ట్ ని రెడీ చేసే బాధ్యతను తీసుకోవాలనుకోవడంలేదట. ఈ నేపధ్యంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్న డైరెక్టర్ వేణుశ్రీరామ్ కే స్ర్కిఫ్ట్ కి మార్పులు, చేర్పులు చేసే బాధ్యతను అప్పగించి తను తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్. ఇదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తాడా? అని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. మరి ఫైనల్ గా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో? ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.