స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యేడాది అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఆల్ రెడీ ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ని వేస్తున్నారు. ఓ భారీ షెడ్యూల్ ని డార్జిలింగ్ లో ప్లాన్ చేసారట. ఇదిలా ఉంటే...
ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ అప్ డేట్ అందరినీ సంభమాశ్చర్యాలకు గురి చేస్తోంది. అసలు విషయం ఏంటంటే... ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశముందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాజమౌళి అడగడం, ఎన్టీఆర్, రాంచరణ్ లతో అనుబంధం, భరత్ అనే నేను చిత్రంతో తనకు భారీ హిట్ ఇచ్చిన నిర్మాత దానయ్య ఈ మల్టీస్టారర్ కి నిర్మాత కావడంతో మహేష్ బాబు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించాడని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తం మీద 'బాహుబలి' తో సృష్టించిన సంచలనాల పరంపరను మరోసారి కొనసాగించడానికి రాజమౌళి సమాయత్తమవుతున్నారని చెప్పొచ్చు.