మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సి.వి.యన్ ఓ మెగా ప్లాన్ కి రంగం సిద్ధం చేసారని తెలుస్తోంది. ప్రిన్స్ మహేష్ బాబు 'శ్రీమంతుడు' చిత్రంతో ఈ బ్యానర్ ఆరంభమయ్యింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ నిర్మాతలు ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'జనతాగ్యారేజ్' అంటూ మరో హిట్ చిత్రం చేసారు. మూడో చిత్రంగా రాంచరణ్ తో 'రంగస్థలం' నిర్మించారు. భారీ విజయాన్ని అందుకున్నారు. నాగచైతన్య తో, రవితేజతో సినిమాలు చేస్తున్న ఈ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
చిరు కోసం సుకుమార్ ఓ స్టోరీ లైన్ ప్రిపేర్ చేసాడట. ఈ స్టోరీ లైన్ చిరుకి చెప్పి, గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ ని భారీగా మేమే నిర్మిస్తామని డైరెక్టర్ సుకుమార్ దగ్గర చెప్పారట మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు. 'సైరా' నరసింహారెడ్డి పూర్తి చేసేలోపు తన దగ్గర ఉన్న స్టోరీ లైన్ కి తుది మెరుగులు దిద్ది చిరుకి వినిపించాలనుకుంటున్నాడట సుకుమార్. అన్ని కుదిరితే చిరు, సుకుమార్ సినిమాని నిర్మించి తమ బ్యానర్ ప్రతిష్ఠను మరింతగా పెంచేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక జరిగితే సుకుమార్ కి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు.