చిత్రం - నాతో నేను
నటీనటులు - ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి, ఐశ్వర్య, దీపాలి, రాజీవ్ కనకాల, సమీర్, సివిఎల్ నరసింహరావు, గౌతంరాజు, భద్రమ్, సుమన్శెట్టి తదితరులు
కెమెరా - ఎస్.మురళీమోహన్రెడ్డి
సంగీతం - సత్య కశ్యప్
బ్యాగ్రౌండ్ స్కోర్ - ఎస్ చిన్నా
ఎడిటింగ్ - నందమూరి హరి
ఆర్ట్ - పెద్దిరాజు అడ్డాల
బ్యానర్ - శ్రీభవ్నేష్ ప్రొడక్షన్స్
సమర్పణ - ఎల్లలు బాబు టంగుటూరి
నిర్మాత - ప్రశాంత్ టంగుటూరి
దర్శకత్వం - శాంతికుమార్ తూర్లపాటి
డైలాగ్ కింగ్ సాయికుమార్, రాజీవ్ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి, ఐశ్వర్య, దీపాలి రాజ్పుత్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నాతో నేను’. జబర్దస్ట్ కమెడీయన్గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై గుర్తింపు పొందిన శాంతికుమార్ తూర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మరి చిన్న తెరపై కామెడీతో అలరించిన ఆయన వెండితెరపై తన సత్తా చాటుకున్నాడా... ఆడియన్స్ ని మెప్పించే విధంగా సినిమా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
ఓ గ్రామంలో ఉన్నత స్థానంలో ఉన్న కోటీశ్వరరావు (సాయికుమార్).. కొన్ని సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే తరుణంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు ను కలిసి కష్టన్ని తెలుసుకుని ఓ వరమిస్తాడు. ఆ తర్వాత ఏమైంది. కోటిగాడు(సాయి శ్రీనివాస్) దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై ప్రేమలో పడడం జరుగుతుంది. ఇంటిలో పెద్దలు అంగీకరించకపోవడంతో ఐశ్వర్య సాయికి హ్యాండ్ వస్తుంది. దాంతో అతని జీవితం ఏమైంది. ఓ మిల్లులో పని చేసే కోటిగాడు (ఆదిత్య ఓం) అతను ఇష్టపడిన అమ్మాయి నాగలక్షీ (దీపాలి) మధ్య ఏం జరిగింది. 60 ఏళ్ల సాయికుమార్, 40 ఏళ్ల ఆదిత్య ఓం. 20 ఏళ్ల సాయి శ్రీనివాస్ల ట్రయాంగిల్ లవ్స్టోరీ చివరికి ఏ తీరానికి చేరింది. స్వామిజీ సాయికుమార్కి ఇచ్చిన వరం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
కోటీశ్వరుడిగా, పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాయికుమార్ తన పాత్రలో లీనమై నటించారు. ఓ మిల్లులో పని చేస్తూనే తను ఇష్డపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన సూపర్బ్. ప్రేమ విఫలం పొందిన పాత్రలో సాయి శ్రీనివాస్ కూడా బాగా నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం
తొలిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్ తూర్లపాటి మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు. కానీ స్ర్కీన్ ప్లే విషయంలో తడబాటు కనిపించింది. నిర్మాతలు కొత్త వారే అయినా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. సంగీతం విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే బావుండేది. మాటలు బావున్నాయి. కామెడీ, భావోద్వేగ సన్నివేశాలు ఆకటుకున్నాయి. రెట్రోసాంగ్, ఐటెమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి.
విశ్లేషణ
మనిషి అనే దాని కంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అన్న కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా ఆవిష్కరించారు. డబ్బు మాత్రమే పరమావధిగా భావించి దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కటి సందేశం ఇచ్చారు. సాయికుమార్ డైలాగ్లు అదిరిపోయేలా ఉన్నాయి. ఓవరాల్గా మంచి సందేశంతో పాటు వినోదాన్ని అందించే ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
రేటింగ్ - 3/5