పాటల రికార్డింగ్ తో తన తాజా చిత్రం "త్రిష"కు శ్రీకారం చుట్టిన యువ దర్శకుడు ఆర్.కె.గాంధీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేశారు. సీనియర్ ఎన్టీఆర్ తరువాత దేవుళ్ళ పాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అని నిరుపించుకున్న సీనియర్ హీరో సుమన్ ఈ చిత్రంలో దైవాంశ సంభూతుడుగా... ప్రధానపాత్ర పోషిస్తున్నారు. 'సంభవామి యుగే యుగే' అన్నది ఈ చిత్రం ఉపశీర్షిక. హైదరాబాద్ శివారు మియాపూర్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు!!
స్నేహాలయం క్రియేషన్స్- బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం - ఈశ్వర్ నాగనాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: కిరణ్ కుమార్ గుడిపల్లి. హనుమంత రాయప్ప లైన్ ప్రొడ్యూసర్. కర్ణాటకలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు "త్రిష" చిత్రం కోసం షూట్ చేయనున్నారు!!
ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్టపన్నాగాలను ఎలా అరికట్టాడు? అనే కథాంశంతో తెరకెక్కుతన్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర, ధీరజ అప్పాజీ, ఆనంద్ మట్ట ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్,ఓ: ధీరజ్ - అప్పాజీ, కెమెరా: ప్రమోద్ భారతీయ, నృత్యాలు: సూర్య కిరణ్, ఆర్ట్: ప్రసాద్, సాహిత్యం-సంగీతం: ఎం.ఎల్.రాజా, లైన్ ప్రొడ్యూసర్: హనుమంత్ రాయప్ప, సమర్పణ: కిరణ్ కుమార్ గుడిపల్లి, నిర్మాతలు: రవీంద్ర బూసం - ఈశ్వర్ నాగనాధ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఆర్.కె.గాంధి!!